Sunday, December 27, 2009

రాజకీయ ఉద్యమాలు - ఆంతర్యాలు

ఊరికే నినాదాలు చెసి, సానుభూతి చుపిస్తే కడుపు నిండదు. ఆకలి వేసిన వాడికి అన్నమో రొట్టో పెడితే కడుపు నిండుతుంది.
ప్రతి రాజకీయ నాయకుడు అవతలి వాళ్ళు ఎమి తప్పు చేఆశారో పదే పదే చెబుతూ, సభలల్లొ వ్యక్తి గత దూషణలకి దిగుతున్నారే కానీ, అవకాశం ఇస్తే తాము ఏ విధమైన (ఆచరణ సాధ్యమైన)విధానాలు పాటించ దల్చుకున్నారు, ఏ విధంగా ప్రజా జీవితం మెరుగు పరచ దల్చుకున్నారు అనే విషయం ప్రస్తావించటం లేదు.
ఇంత గొంతు చించుకు అరుస్తున్న నల్గొండ ఫ్లోరైడు సమస్య ఇప్పటి వరకు సమస్య గానే ఎందుకు మిగిలి పోయింది? అక్కడి నించి రాజకీయ ప్రాతినిధ్యం లేదా?
అలాగే మన గౌరవనీయ తెలంగాణా ప్రజా నాయకుదు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీం నగర్ ప్రాంతం లొ చేనేత కార్మికులు ప్రాణ త్యాగాలు ఎందుకు చేస్తున్నారు? ఆకలి చావులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఆ నరఘోష ఆపటానికి ఆయన తీసుకున్న చర్యలు ఎమిటి?
అవునులే ఆయనికి బయట పల్లకీ మోత లో ఇంట్లొ ఈగల మోత పట్టించుకో వలసిన విషయం గా కనిపించక పొయి ఉండచు.
అసలు ఇంతకీ తెలంగాణా వేర్పాటు నాయకులు ప్రత్యేక రాష్ట్రం ఎర్పడితే, ఇప్పటి వరకు కలిగిన నష్టాన్ని తాము ఎల పూడ్చ దలచుకున్నారు, రాష్ట్ర (వారు కోరుకున్న ప్రత్యేక రాష్ట్రం) సర్వతొముఖ అభివ్రుద్ధికి తమ ప్రణాలికలు ఎమిటి? అని ఒక్క సభలొనైనా ప్రస్తావిస్తున్నారా?
బాధ్యతలు లెని హక్కులు ప్రమాదకరం.
స్వాంతంత్ర్యం వచిన తరువాత, ఆంధ్ర రాష్ట్రం ఎర్పడిన ఈ ఎభై మూడు సంవత్సరాలనించి తెలంగాణా ప్రాంత శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు తమ తమ వెనుకబడిన ప్రాంతాల అభివ్రుద్ధికి ఎమైనా కార్యా చరణ ప్రణాలికలు రూపొందించించి, అవి చట్ట సభలలొ ప్రభుత్వ ద్రుష్టి కి, ఇతర సభ్యుల ద్రుష్టి కి తీసుకు వచారా? తమ సమస్యల పరిష్కారానికి పోరాడి సాధించుకొ గలిగారా?
ఆ పని ఎందుకు చెయ్య లెక పోయారు? పదవిలోకి వచెవరకు ఎల వస్తామా అనే రంధి, వచాక ఈ 5 సంవత్సరాలూ తము ఎంత సంపాదించి వెనక వేసుకొగలము, తమ బంధు / ఆస్రితులకి ఎలా పదవ్లు కట్ట బెట్టాలి అనె రంధి- దీనితోనె సరిపోతున్నది. ఇంక ప్రజా సమస్యలు ప్రస్తావించె సమయం ఎక్కడ పాపం, మనమె అర్ధం చేసుకోవాలి. కాబట్టి సమస్యలు అనేవి ఇంకొక 50 సంవత్సారాలు గడిచినా , ప్రత్యెఏక రాష్ట్రం వచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడె అని పాపం ఈ పిచి ప్రజలకి తెలియక అనావసరంగా కాలం వ్రుధా చెసుకుంటున్నారు.
ఈ విషయం అమాయక ప్రజలు ఎంత త్వరగా తెలుసుకుంటె ఈ ఉద్యమ ఉధ్రుతం అంత త్వరగా తగ్గి ప్రశాంత వాతా వరణం ఏర్పడుతుంది.
ఈ ఉద్యమాల వలన రజకీయ నాయకుల స్వార్ధ ప్రయోజనాలు నెరవేరుతాయె కాని, సామాన్య పౌరుడి కదుపు నింపేది, వాళ్ళ నెల జీతాలే.
హైదరాబాదు లో ఉన్న అనేక మంది మధ్య తరగతి, ఆ మాట కొస్తె ఈ మానవ, ఆస్తుల, మారణ హొమం జరుగుతున్న ఏ ప్రదెశం లొ ఉన్న మధ్య తరగతి వాళ్ళు ఐన ఆయా ప్రదెశాలలొ ఉండటానికి ప్రభుత్వొద్యొగాలొ, ఆ ప్రాంతాలలొ ఉన్న ప్రైవెటు సంస్థలలొ ఉద్యొగలొ కారణం. వాళ్ళు ఆ ఉద్యొగలలొ ఏ రిక్రూట్మెంట్ బొర్దు ద్వారానొ, ఇంకొక రకమైన పరీక్షలు రాసి మెరిట్ మీద ప్రవెసించిన వారె కాని, ఇంకొకరి హక్కులు కాల రాసెటంత అవసరం కాని అక్కర కాని లెనివాళ్ళె.ఎవరొ పెద్దలు చెప్పినట్లు ఇప్పటికైన బాధ్యత కల నాయకులు తమ నాయకత్వ బలపరీక్ష మానెసి, సమస్యని ఎవరు స్రుష్టించారు అనె చర్చ మానెసి, వాళ్ళె దీనికి పరిష్కారం చుపాలి అనె పలాయన వాదం మానెసి తమ వంతు చిత్త శుధి తొ కల్లొలిత ప్రాంతాలకి వెళ్ళి వాళ్ళని శంతింప చెసి,ధైర్యం గ నమ్మకంగ మాట్లాడితే అది ఆశించె ప్రజలకి కొంత ఊరట కలుగుతుంది. ఇప్పుదు వెంటనె చెయ్యవలసిన పని అది కాని, నిరాహార దీక్ష సిబిరాలు నడపటం కాదు. నాయకు లనె వాళ్ళు ఇలాంటి ఉద్యమాల నించె పుట్టుకొస్తారు.

No comments:

Post a Comment