Saturday, December 19, 2009

ప్రస్తుత ఆంద్ర రాజకీయాలు - విశ్లేషణ- ఆర్ధిక కొణం

రాజకీయ పార్టీల నాయకుల ఆంతర్యం అంతరాత్మ తెలియక , వారిని అనుసరించి ఉద్యమాలలో పాల్గొనే సామాన్య మానవుడి బతుకు గాలిలో పెట్టిన దీపం చందం ఊగిసలాడుతున్నది.



నలభై సంవత్సరాల మాట పక్కన పెడితే, గత ఐదారు సంవత్సరాలుగా తెలంగాణా అనే నినాదం కాస్త ఊపు అందుకున్న మాట వాస్తవం. సరే రెండు మూడు సంవత్సరాలుగా, ఎప్పుడు ఐతే తమకి సీట్లు తగ్గటం మొదలు పెట్టాయోఅప్పటి నించి,టీఆరెస్ నాయకులు తమకి చేతనైన గిమ్మిక్కులన్నీ చెయ్యటం మొదలు పెట్టాయి. దీనికి తందానా తాన అని , సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా , ఏ మాత్రం హోంవర్క్ చెయ్యకుండా, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలని ఆశించి మిగిలిన రాజకీయ పక్షాలన్నీ మేము తెలంగాణా కి అనుకూలం అంటూ పాట పాడటం మొదలు పెట్టాయి. కేంద్రం ప్రకటించినప్పుడు కదా, అసలు ప్రకటనే రాదు అనే నమ్మకంతో ఇప్పటి వరకు వ్యవహారాన్ని నడిపించాయి.

అసలు ఆ పరిస్థితి వస్తే , తీర్మానాన్ని ప్రవేశ పెడితే తమ వ్యూహం ఏమిటి, విధి విధానాలు ఏమిటి, ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండటానికి తాము అనుసరించ దల్చుకున్న పధతులు ఏమిటి, నీటి వనరుల పంపిణీ లోను , ఎలాన్గానా ప్రాంతాన్ అభివ్రుది చేయబడిన మౌలిక సదుపాయాలలో తమకు న్యాయం గా రావలసిన వాటా ఎలా అడగదల్చుకున్నారు అనే విషయాల పట్ల హోం వర్క్ చేసి ఉండాలి. కాని మన దురదృష్టం కొద్దీ మనకున్న నాయకులందరూ అవకాసవాదులే తమ వంతు ప్రక్రియ తాము చెయ్యకపోగా, ప్రజల మనోభీష్టం ఇంటప్రగాధం గా ఉన్నాడని మేము ఉహించలేదు అనే ప్రకటన ఇవ్వటానికి సిగ్గు పడటం లేదు .




ఇవ్వాళ్ళ ఆ కారణం వల్లనే కేంద్రం, రాష్ట్రం లో మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఇందుకు సుముఖం ఉన్నాయ్ అనే సందేశం అందింది కనుకనే మేము ధైర్యం చేసాము అని చెప్పే పరిస్థితి వచ్చింది.

ప్రత్యెక తెలంగాణా ప్రకటన చేసే ముందు, మమ్మల్ని ఎవరిని సంప్రదించలేదు అనే సాకు ఎంతఅవకాసవాదమో చెప్పాలంటే మనము కొత్త నిఘంటువులని వెతకాలి.

రాష్ట్ర విభజన అంటూ జరిగితే, ఫలానా ఫలానా ప్రదేశాలు రాష్ట్ర పరిధి లో కి వస్తాయి, కామన్ నిధుల మరియు వనరుల పంపకం ఇలా ఉంటుంది, దీని వలన లాభ నష్టాలు ఇవి అని అన్ని ప్రాంతాల నిపుణులని, నాయకులని పిలిచి చర్చలు జరిపి సూత్ర ప్రాయం గ ఒక ముసాయిదా ని తయారు చెయ్యటం అనే ప్రక్రియ కేంద్రం చెయ్యకపోవటం బాధ్యతా రాహిత్య చర్య. ఈ పని రాష్ట్రం లోని మిగిలిన అన్ని (తెలంగాణా ని సమర్దిస్తున్నాము అని ప్రకటించిన )రాజకీయ పార్టీలు కూడా చేసి ఉండాలి. అందరు కలిసి చేసిన బాధ్యతా రాహిత్య పనుల వలన ఇవ్వాళ్ళ సామాన్య మానవుడి బ్రతుకు నది రోడ్డు మీద పడింది.



సామాన్య పరిపాలన లేదు, సంక్షేమ పధకాల అమలు లేదు . సగటు జీవితం స్తంభింతమే కాక బడుగు జీవి బ్రతుకు ప్రశ్నార్ధకం అయింది. దీనికి జవాబు దారులు ఎవరు ?






పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకి ఇప్పుడు జరుగుతున్నా నష్టం వేళ కోట్ల లో ఉన్నది అంటే దాని ప్రభావం రేపు కట్ట లేని పన్నుల రూపం లో అది మొత్తం ఆర్ధిక వ్యవస్థని దెబ్బ తియ్యడా ? ముందు ముందు ఉన్నా పరిశ్రమలు కొత్త చోటికి తరలి పోవని నమ్మకం ఏమైనా ఉన్నదా? కొత్త పరిశ్రమలని ఆకర్షించటానికి కావలసిన వాతావరణం, వాళ్ల నిబంధనలకి కట్టు బడటం అనే ప్రక్రియ లో వెనక బద్దాము , అందుకే కొన్ని పరిశ్రమలు వేరే రాష్ట్రాలకి తరలి పోయాయి అని బాధ పడుతుంటే , ఇప్పుడు ఉన్నవి పోయే పరిస్థితి వచ్చింది.








దీనికి మూల్యం ఎవరు చెల్లిస్తారు ?






అంతర్జాతీయ సంస్థలని ఆకర్షించాలంటే, నాయకులకి ఏంటో ముందు చూపు, అవగాహన ఉండాలి. మన అభివ్రుది పట్ల ఏంటో నిబధత ఉండాలి. కేవలం సందేశాలు ఇవ్వటం వలన, వేర్పాటు ధోరణుల వలన ఏమి సాధించలేము. రేపు మన ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అవ్వాలంటే , ఈ పోటీ ప్రపంచం లో వచ్చిన ప్రతి అవకాసం ఉపయోగించుకోవాలంటే రాజకీయాలకి అతీతం గా ఆలోచించగలగాలి.





చాలా దేశాలకి లేని ప్రత్యేకతలు -వనరుల రీత్యా (ప్రక్రుతి మరియు మానవ ), వాతావరణ రీత్యా, మన దేశానికి ఉన్నాయి. దుబాయి దేశం తీసుకుంటే అక్కడ వర్షాలు లేవు, త్రాగు నీటి సౌకర్యానికి కావలసిన నదులు లేవు, ఖనిజ సంపద లేదు, వ్యవసాయ యోగ్త్యత (నీటి వనరులు లేక ) లేదు, వాతావరణ సమతుల్యత లేదు. అయినా అక్కడి నాయకులకి (ప్రభుత్వానికి ) అభివ్రుది చెందాలన్న తపన , తృష్ణ , అమెరికా లాంటి అభివ్రుది చెందినా దేశం తో పోటీ పాడాలన్న కసి ఉన్నయి కాబట్టి రాత్రింబవళ్ళు కష్ట పది అనుకున్నది అనుకున్నట్లు ప్రణాళిక బద్దం గా సాధిస్తున్నారు. ఒక ఇరవై సంవత్సరాల క్రిత్రం దుబాయి ఒక ఎడారి మాత్రమె. ఈ ఇరవై సంవత్సరాలలో వాళ్ళు సాధించినది చుస్తే ఎవరైనా మేచుకుని తీరవలసిందే. ఇప్పుడు వారు కూడా ప్రపంచ మాంద్యం లో కొంత ఇబ్బంది పడుతున్నా, వాళ్ళ కున్న ఆ అంకిత భావం తో తిరిగి పుంజు కోవటానికి ఎంతో సమయం పట్టా దు.





ఇక్కడ మనము చెప్పుకుంటున్నది పాలితులకి తెలంగాణా అభివ్రుది కాంక్ష, అంకిత భావం.





మనకి అన్నీ ఉంది కూడా మన వ్యక్తీ గత కక్షల కోసం, సాధించిన అభివ్రుధిని మన చేతులతో మనమే నాశనం చేసుకోవటానికి సిద్ధ పడుతున్నామంటే మన అవివేకం ఏ స్థాయి లో ఉన్నదో తెలుసుకుని సిగ్గు పడాలి.






ప్రజా నాయకుడు కెసిఆర్ గారు బ్రహ్మాండం బద్దలు అయినా భూ కంపం వచ్చిన ఉద్యమం నడిపి తీరుతాను. అని ప్రజలకి హామీలు ఇస్తున్నారు. భూ కంపం వస్తే మిగిలేది స్మసానమే కానీ, పచదనమూ కాదు, అభివ్రుది కాదు.





ఇది ఎంత పెద్ద దేబ్బో ఈ అవకాశవాద రాజకీయ నాయకులకి తెలుస్తున్నదా? వాళ్లకి అసలు మనస్సాక్షి అనేది ఉన్నదా?




No comments:

Post a Comment