Wednesday, January 20, 2010

అవినీతికి పట్టం

దేశం లో అభివ్రుది పేరు చెప్పి ఫ్లై ఓవర్ లు కట్టటం మొదలు పెట్టినప్పటి నించీ ఏలిన వారి తాలూకు కాంట్రాక్టర్ ల కి పండగే పండగ.

రెండు సంవత్సరాలక్రితం హైదరాబాద్ లో ని పంజాగుట్ట లో నిర్మాణం లో ఉన్న ఫ్లై ఓవర్ నిట్టనిలువు గా కూలిపోయి దారిన పోయే వారు దాని కింద పది ప్రాణాలు పోగొట్టు కుంటే, సహాయక చర్యలు చేపట్టిన దాని కంటే వేగం గా ఆ కాంట్రాక్టర్ ని కాపాడటానికి సర్కారు ప్రయత్నం చేసింది.

దాన్ని ప్రజలు ఇంకా మర్చి పోక ముందే డిల్లీ లో మరో రైల్వే బ్రిడ్జి నిర్మాణం లో పిల్లర్ ల లో పగుళ్ళు, నాసి రకం పనులు అని వార్తా.

అక్కడా ఇక్కడా కుడా కాంట్రాక్టర్ లు గామన్ కంపనీ వాళ్ళే. వాళ్ళ గురించి సామాన్య మానవులు, బాధితులు మాట్లాడే లోపే, ఈ కంపనీ చాలా పెద్దది, అంతర్జాతీయం గా కుడా అనేక ప్రాజెక్టులు నిర్మించిన అనుభవం ఉన్నది అని సర్కారు వారు వాళ్ళని భుజాన వేసుకుని సమర్ధించటం మొదలు పెట్టారు.

అప్పుడే ప్రజలకి అర్ధం అయి ఉండాలి, వీళ్ళ మీద ఎ విధమైన చర్యలు తీసుకోరని, మళ్ళీ కొత్త కాంట్రాక్టులు వీళ్ళకే కట్టబెదతారని . ఇప్పుడు అదే జరిగింది. నిర్మాణ పనులకి అర్హత సంపాదించాలంటే కనీసం కొన్ని కూలి పోవాలని, కొంత మంది ని వాటికి బలి చెయ్యాలని, అదే ప్రమాణాన్ని నిర్ణయించే విధానమని సర్కార్ నిరూపించింది.

దీన్ని సంక్షేమం అంటారా ?

కంచే చేను మేస్తే, కాపాడేది ఎవరు?

వేలు లక్షలు పన్నులు కట్టి, ప్రభుత్వాలని కట్ట పెట్టి న సామాన్య ప్రజల ఇంటరెస్ట్ ల ని వీరు అలివి మాలిన అవినీతికి తాకట్టు పెట్టారనుకోవచా?

తెలుగు వారి అన్న గారి వర్ధంతి

అన్న గారిని తలచు కుంటే ప్రతీ తెలుగు వాడికి ఓడలు పులకరిస్తుంది అంటే అతిశయోక్తి (పౌరాణిక పాత్ర ల కి సంబందినంత వరకు ) కాదేమో.
కానీ తెలుగు ఆత్మా గౌరవానికి సంబంధించినంత వరకు నా అనుభవం పది మందితో పంచుకోవాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను.
నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లో గుజరాత్ వెళ్ళటం జరిగింది. అక్కడ గ్రామీణ ప్రాంతాల లో గుజరాతీ భాష తప్ప హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఎవ్వరు మాట్లాడరు. నన్ను వాళ్ళు ఎక్కడి నించి వచారు అని అడిగారు. నేను ఆంద్ర ప్రదేశ్ అని చెప్పగానే, ఓహో ఎన్టీ రామా రావు గారి రాష్ట్రమా అని అడిగే టప్పటికి నాకు చాల ఆశ్చర్యం వేసింది. నేను వెళ్ళిన చోట విద్య, లోక జ్ఞానం, సామాన్య విషయ అవగాహన చాలాచాలా తక్కువగా నేను గ్రహించాను. అలాంటి చోట వాళ్ళు ఆయన గురించి ప్రస్తావించి, మమ్మల్ని ఆ రాష్ట్రం వారిగా చూడటం ఎంతోగొప్ప గా అనిపించింది.
అదీ ఆయన ప్రభావం అని తెలుసుకుని మేము ఆశ్చర్యం తో కూడిన సంతోషం అనుభవిన్చాము
ఇప్పుడు ఆంద్ర ప్రదేశ్ లో ఉన్న స్థితి తెలుసుకుంటే ఆయన ఆత్మా ఘోశిస్తుందేమో.

Saturday, January 16, 2010

ప్రజాస్వామ్యం - వ్యక్తిగత హక్కులు

శాంతి భద్రతలని రక్షించి మనకి ప్రశాంతమైన జీవితాలని అందించే ఒక ఉన్నత స్థాయి అధికారి కి ఒక విషయం గురించి వ్యక్తీ గత స్థాయి లో కానీ, సాంకేతిక పరంగా కానీ, పూర్వ అనుభవం తో కానీ వ్యాఖ్యానించే అర్హత, అధికారం, స్వేఛలేవు. వారి అభిప్రాయాలని నిస్సంకోచం గా నిర్భీతి గా వ్యక్త పరిచే అవకాశంప్రజాస్వామ్యం లో లేదనిమన రాజకీయ నాయకులు నిరూపిస్తున్నారు.

డీజీపీ గిరీష్ కుమార్ గారు ఒక బాధ్యతా గల ఉద్యోగి. ఒక ఉన్నత స్థాయి అధికారి. శాంతి భద్రతల సంరక్షణ లో అనుభవం ఉన్న వ్యక్తీ. ఆయనేమి ఒక రాజకీయ నాయకుడు కాదు. ఏదో పబ్బం గడుపుకోవటానికి ఏదో ఒక వ్యాఖ్య చెయ్యటానికి. ఎంత సమర్ధత ఉన్నా, ఎన్ని అర్హతలు ఉన్నా వారి ఇష్టం వచినట్లు వ్యవహరించటానికి వారికీ నియమాలు, పరిమితులు ఉన్నాయి. అలాంటి వ్యక్తీ రూపొందించే రిపోర్ట్ లు కొంత సాంకేతికం గాను, పూర్వ అనుభవం తో నూ ఉంటాయే కానీ వారికి రాజకీయ ఎత్తుగడల అవసరం ఏముంటుంది?

పదే
పదే వారి వ్యాఖ్యలని ఉప సంహ రించుకోమని రాజకీయ నాయకులు కోరటం ఏ ప్రజా స్వామ్యానికి నిదర్సనం? ఏ అర్హత (కేవలం రాజకీయ కేళి లో నెగ్గి ) (క్షమించాలి ఈ మాట అంటున్నందుకు ) లేకుండా, నిపుణులైన వారి సేవలని సకుటుంబం గా అనుభవిస్తూ వాళ్ళని చిన్న పెద్ద మాటలంటూ
వారి సంరక్షణ లో నే రోజు వారీ జీవితాన్ని ప్రశాంతంగా నెట్టుకొస్తున్న ఈ రాజకీయ నాయకులు ఆగడాలు మన ప్రజా స్వామ్యం లో నే అనుకుంటే మనము సిగ్గు పడాలేమో

ఈ ప్రజలేటు పొతే నాకేం అని వాళ్ళు ఒక్క క్షణం విశ్రమిస్తేమన దైనందిన జీవితాలు ఈ రాజకీయ నాయకుల స్వార్ధ కేళి లో గుండె దుడుకు గా నడవ వలసినవే.

సామాన్య ప్రజలకి వీసమెత్తు ఉపయోగ పాడనీ ఈ రాజాకీయ నాయకుల వ్యక్తీ గత దూషణలు, ఆవేసపు వ్యాఖ్యలు ఉపసంహరించు కోమని, ఉద్యమించి విజయం సాధించ గల రోజు ఎప్పుడు వస్తుందో కదా.

ఇలా మనకి నచని ప్రతి వ్యాఖ్య ని ఉపసంహ రించుకోమని వత్తిడి చేస్తే మన ప్రియతమా నాయకుడు కేసీఆర్ ప్రతి రోజు ప్రతి మాటని తూకం వేసి నోరు సంబాలించుకుని మాట్లాడాలి. ఆ మాట కొస్తే ఏ రాజకీయ నాయకుడు వివాదాలకతీతం గా మాట్లాడుతున్నారు?

రాజకీయ నాయకుల కి ఉన్న వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తీ గత స్వేఛ వాళ్ళని అను నిత్యం కాపాడుతున్న అధికారులకి నిపుణుల కి లేక పోవటం శోచనీయం.

అందరు ఉన్నత స్థాయి అధికారులు ఒకే విధం గా ఏ ఎండా కి ఆ గొడుగు పడతారు అనుకుంటే పొరబాటే. వాళ్ళ ప్రత్యెక విషయ పరిధి లో కి సామాన్యులు చోచుకు పొతే సామాన్య మానవుడి కి అందే సేవల లో నాణ్యత తగ్గి తీరుతుంది. అందుకే ఎవరి పని వాళ్ళని చేసుకో నివ్వాలి.