Wednesday, January 20, 2010

అవినీతికి పట్టం

దేశం లో అభివ్రుది పేరు చెప్పి ఫ్లై ఓవర్ లు కట్టటం మొదలు పెట్టినప్పటి నించీ ఏలిన వారి తాలూకు కాంట్రాక్టర్ ల కి పండగే పండగ.

రెండు సంవత్సరాలక్రితం హైదరాబాద్ లో ని పంజాగుట్ట లో నిర్మాణం లో ఉన్న ఫ్లై ఓవర్ నిట్టనిలువు గా కూలిపోయి దారిన పోయే వారు దాని కింద పది ప్రాణాలు పోగొట్టు కుంటే, సహాయక చర్యలు చేపట్టిన దాని కంటే వేగం గా ఆ కాంట్రాక్టర్ ని కాపాడటానికి సర్కారు ప్రయత్నం చేసింది.

దాన్ని ప్రజలు ఇంకా మర్చి పోక ముందే డిల్లీ లో మరో రైల్వే బ్రిడ్జి నిర్మాణం లో పిల్లర్ ల లో పగుళ్ళు, నాసి రకం పనులు అని వార్తా.

అక్కడా ఇక్కడా కుడా కాంట్రాక్టర్ లు గామన్ కంపనీ వాళ్ళే. వాళ్ళ గురించి సామాన్య మానవులు, బాధితులు మాట్లాడే లోపే, ఈ కంపనీ చాలా పెద్దది, అంతర్జాతీయం గా కుడా అనేక ప్రాజెక్టులు నిర్మించిన అనుభవం ఉన్నది అని సర్కారు వారు వాళ్ళని భుజాన వేసుకుని సమర్ధించటం మొదలు పెట్టారు.

అప్పుడే ప్రజలకి అర్ధం అయి ఉండాలి, వీళ్ళ మీద ఎ విధమైన చర్యలు తీసుకోరని, మళ్ళీ కొత్త కాంట్రాక్టులు వీళ్ళకే కట్టబెదతారని . ఇప్పుడు అదే జరిగింది. నిర్మాణ పనులకి అర్హత సంపాదించాలంటే కనీసం కొన్ని కూలి పోవాలని, కొంత మంది ని వాటికి బలి చెయ్యాలని, అదే ప్రమాణాన్ని నిర్ణయించే విధానమని సర్కార్ నిరూపించింది.

దీన్ని సంక్షేమం అంటారా ?

కంచే చేను మేస్తే, కాపాడేది ఎవరు?

వేలు లక్షలు పన్నులు కట్టి, ప్రభుత్వాలని కట్ట పెట్టి న సామాన్య ప్రజల ఇంటరెస్ట్ ల ని వీరు అలివి మాలిన అవినీతికి తాకట్టు పెట్టారనుకోవచా?

No comments:

Post a Comment