Tuesday, February 2, 2010

వ్యవసాయ భూముల క్షోభ - సరళీకృత ఆర్ధిక విధానాలు

ఇప్పటికీ భారత దేశం లో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత వృత్తుల పై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, బడ్జెట్ కేటాయింపులు అందుకు అనుగుణం గా ఉండాలి అనేది ఒక సర్వ సాధారణ అవసరం.
కానీ మన ప్రభుత్వం అందుకు విరుద్ధం గా, సరళీకృత ఆర్ధిక విధానం పేరిట వ్యవసాయ భూములని వ్యవసాయేతర కార్యకలాపాలైన ప్రత్యేక ఆర్ధిక మండళ్ళకి, పారిశ్రామిక మండళ్ళకి కేటాయించి ఆహార ధాన్యాల ఉత్పత్తి మీద ఒక పధ్ధతి
ప్రకారం దెబ్బ కొడుతున్నది. రైతులు ఎంత తమ అ యిష్ట త ని, అసహనాన్ని ఉద్యమ రూపం గా వ్యక్త పరిచినా ప్రభుత్వం పట్టించు కో దాల్చుకున్నట్లు లేదు.
గత పదిహేను ఇరవై సంవత్సరాలు గా, లాభ సాటి గా ఉంటుంది అనే మిష తో కోస్త్రాంధ్ర లో చాలా వ్యవసాయ భూములని చేపల చెరువులు గా మార్చి ఆ భూమి ని పంటలు పండించటానికి అ యోగ్యం గా మార్చారు. చేపల చెరువు గా మార్చబడిన పొలం మళ్ళీ ఏమి చేసినాఆహారధాన్యాలు పండించటానికి పనికి రాదు.
చేపల సాగు విధానం పూర్తిగా వేరు కాబట్టి భూమి తన సహజమైన సారాన్ని కోల్పోతుంది.
పర్యావరణంకాలుష్యం పేరు చెప్పి, తెగులు సోకి అధిక సంఖ్యా లో చేపలు రొయ్యలు చని పోయి నష్టం వాటిల్లుతున్నదనీ ఆ పొలాలని రైతులు ఇళ్ళ స్థలాలుగా మార్చి తమ నష్టాన్ని భర్తీ చేసుకున్నారు.
ఈ విధంగా చక్కటి నీటి వసతి ఉన్ డీ , సారవంత మై ఆహార ధాన్యాలు పండిం చ గలిగిన భూమి ని కొంత నష్ట పోయాము. ఇది చాలదన్నట్లు, ఇప్పుడు ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ భూములని సేకరించి ప్రత్యేక ఆర్ధిక మండళ్ళకి (బడా వ్యాపార వేత్తలకి లాభం చేకుర్చతానికి )కేటాయించా టానికి ప్రయత్నించటం రైతుల పాలిత మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ చందం గా ఉన్నది.
ఈ విధం గా రాను రాను ఆహార ధాన్యాలు పండించే భూములన్నీ సర్కార్ వారి పుణ్యమా ని కొంతా, లాభాల దృష్టి తో కొంతా హరించుకు పొతే కేవలం తిండి గింజల కోసం కుడా బయటి దేశాల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే పరిస్థితి వస్తుందేమో. మన పాలకుల కోరిక కుడా అదేనేమో.
ఆకలి వేస్తెమౌలికం గా తిన వలసినది అన్నం కానీ రొట్టె కానీ. ఆదరువు గా తినే చేపలూ కాదు, పారిశ్రామికం గా ఉత్పత్తి అయిన వస్తువులు కాదు.
సారవంతమైన భూమి లేక పొతే ఎవరము ఏమి చెయ్యలేము, లేదా భూమి ఉన్ డీ నీటి వసతి లేక పోయినా ఏమి చెయ్యలేము.
ఇక్కడ అన్నీ ఉన్ డీ సర్కార్ విధానాల వలన రైతు నోట్లో ను, భారత పౌరుల నోట్లోను మట్టి కొడుతున్నారు.
మద్దతు ధర ఇచ్చి రైతుని ప్రోత్సహించటం, రైతుని బతికించటం బాద్య త అని అనుకోవటం లేదు.
సమయానికి విత్తనాలు, పురుగు మందులు సరఫరా చేసి ప్రక్రుతి ఆధారిత రంగాన్ని ఆదుకోవాలని అనుకోవటం లేదు.
అగ్ర దేశాలు సబ్సిడీలు రైతులకి తీసేయ్యమన్నారు కాబట్టి వెంటనే అమలు పరిచారు.
కొత్త రంగాలని అభివృద్ధి చెయ్యటానికి ఉన్న వనరులన్నీమళ్ళించి, వీలు అయితే సంక్షేమం అంటా మట్టి కలిపి , బోలెడంత కాలం వృధా చెయ్యటానికి సిద్ధ పడుతున్నారు కానీ, ఉన్న దాన్ని సంరక్షించి మేలు చెయ్యాలని అనుకోవటం లేదు.
ఆర్ధిక విధానాలలో భాగం గా ప్రభుత్వ భాగస్వామ్యం తగ్గించాలి అని మనలని శాసిస్తున్న అగ్ర రాజ్యం (ప్రపంచ బ్యాంకుద్వారా )తమ రంగాలలో ప్రభుత్వ ప్రమేయాన్ని (ఆర్ధిక ఉద్దీపన పేరు చెప్పి) అంతకంతకీ పెంచుతున్నది.
అగ్ర దేశాలు ఏమి శాసిస్తే దానికి తందానా తాన అనటమే పరిపాలనా ?
ఇది నవీన కాలపు సంక్షేమమా ?

No comments:

Post a Comment