Wednesday, January 20, 2010

తెలుగు వారి అన్న గారి వర్ధంతి

అన్న గారిని తలచు కుంటే ప్రతీ తెలుగు వాడికి ఓడలు పులకరిస్తుంది అంటే అతిశయోక్తి (పౌరాణిక పాత్ర ల కి సంబందినంత వరకు ) కాదేమో.
కానీ తెలుగు ఆత్మా గౌరవానికి సంబంధించినంత వరకు నా అనుభవం పది మందితో పంచుకోవాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను.
నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లో గుజరాత్ వెళ్ళటం జరిగింది. అక్కడ గ్రామీణ ప్రాంతాల లో గుజరాతీ భాష తప్ప హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఎవ్వరు మాట్లాడరు. నన్ను వాళ్ళు ఎక్కడి నించి వచారు అని అడిగారు. నేను ఆంద్ర ప్రదేశ్ అని చెప్పగానే, ఓహో ఎన్టీ రామా రావు గారి రాష్ట్రమా అని అడిగే టప్పటికి నాకు చాల ఆశ్చర్యం వేసింది. నేను వెళ్ళిన చోట విద్య, లోక జ్ఞానం, సామాన్య విషయ అవగాహన చాలాచాలా తక్కువగా నేను గ్రహించాను. అలాంటి చోట వాళ్ళు ఆయన గురించి ప్రస్తావించి, మమ్మల్ని ఆ రాష్ట్రం వారిగా చూడటం ఎంతోగొప్ప గా అనిపించింది.
అదీ ఆయన ప్రభావం అని తెలుసుకుని మేము ఆశ్చర్యం తో కూడిన సంతోషం అనుభవిన్చాము
ఇప్పుడు ఆంద్ర ప్రదేశ్ లో ఉన్న స్థితి తెలుసుకుంటే ఆయన ఆత్మా ఘోశిస్తుందేమో.

No comments:

Post a Comment