Friday, December 18, 2009

అవకాశవాద రాజకీయాలు - అడుగంటిన ప్రజాక్షేమం

రాజకీయాల్లొ నాటకీయత పెరుగుతున్నదే కాని, ప్రజా సంక్షెమం అనేది 'నేతి బీరకాయలొ నెయ్యి లాగె' కనిపించకుండా పొతున్నది.

ఇవ్వాళ సమైక్య ఆంధ్ర కావాలని ఇంత గా నినదిస్తున్న నాయకులు, 1974 లొ ఆంధ్ర ఉద్యమం ఎందుకు చెశారని,ఒక తెలంగాణ నాయకుదు తెలివిగా మీడియా లొ ప్రశ్నించారు.
నిజమే, అది 40 సంవత్సరాల కిందటి మాట. అప్పటికి రాష్ట్రం ఇంత అభివ్రుది చెందలేదు. అప్పటి రాజకీయ నాయకులు ఇంత గా నోరు పారేసుకోలేదు . ఇంత అసభ్య పద జాలం ఉపయోగించలేదు.

పెద్దలు చెప్పినట్లు, "మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు".

"తమలపాకు తొ నువ్వొకటి అంటె తలుపు చెక్క తొ నెనొకటి అంటాను" అన్నట్లు, కెసీఅర్ గారు హీనమైన, అసభ్య పదజాలం ఉపయోగించి ఆంధ్రులని తిట్టెటప్పటికి ఆంధ్ర నాయకులందరు ఆత్మ రక్షణ లొ పడాల్సి వచింది.తమ ప్రజలకి సమాధానం చెప్పుకొవలసిన పరిస్థితి ఎర్పద్డింది.

ఈ విషయం మొత్తం లో ఆలొచించవలసింది, ఆ వెళ (1974 లొ) హైదరాబాదు ఇవ్వాళ ఉన్నంత సంపదతొ, అవకాశాలతొ విదెశీయులని పెట్టుబదులతొ ఆకర్షించె స్థితి లొ లెదు. బహుశ అందుకె గౌరవనీయులు ఆనాటి నాయకులు అందరు ఊరుకున్నారు .

ఆ తరువాత ఎంతొ మంది ముఖ్య మంత్రులు తెలంగాణ నించి వచ్చిన వారు కూడా (పివి నరసిమ్హరావు గారు, తి అంజయ్య గారు, జలగం వెంగళరావు గారు)పరిపాలించారు. అప్పుడు ఈ ఆక్రోసిస్తున్న నాయకులు మాకేమి చేసారు అని కానీ , మాకు అన్యాయం జరిగింది అని కానీ అడగలేదు. వాస్తవానికి అన్యాయం జరగలేదు కాబట్టి.

ప్రభుత్వోద్యోగాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కాని, రైల్వే ఉద్యోగాలు ఐతే రైల్వే రిక్రుత్మేంట్ బోర్డు ద్వారా కాని మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయబదతాయే కాని, ప్రాంతీయ ప్రాదిపదికన అన్యాయమైన విధానాల ద్వారా కాదు అనే విషయం ఈ విద్యవేత్తలకి తెలియదా? ఇక ప్రైవేటు ఉద్యోగాలు, ఆయా సంస్థల భర్తీ విధానాల ద్వారా జరుగుతాయ్ కాని, వాటికి ప్రాంతీయత, అన్యాయం, మోసం హక్కులు కాలరాయటం అనే ప్రసక్తి ఉండదు అని మేధావులు తెలుసుకుంటే ప్రజలని మోసం చేసే నినాదాలు ఆక్రోశాలు ఉండవు.

ఇవ్వళ కెసీఅర్ చెప్పేవరకు మేధావులకి , లాయర్లకి తెలంగాణ వాదమే గుర్తు రాలెదు. ఎందుకంటే ఈ ప్రజాహింస, వెర్పాటు ధొరణి ఆయన ఒక పధకం ప్రకారం జనాలని రెచగొట్టి , తన పట్ల తన స్వంత పార్తి లొ నె ఉన్న అసంత్రుప్తి సెగలని చల్లార్చి వాళ్ళ దృష్టి మళ్ళించి అసమ్మతి ని అణచి వెయ్యటానికె పన్నిన వ్యుహం అంటె తప్పు అవుతుందా?

ఇంకా విచిత్రం ఎమిటంటె ఇవ్వళ, ప్రజా రాజ్యం పార్టీ తెలంగాణ విభాగం వాళ్ళు చిరంజీవి నించి విడిపొయి టీఆరెస్ లో చేరకుండా , "తెలంగాణ ప్రజారాజ్యం పార్టి" అనె కొత్త పార్టి గా ఆవిర్భావిన్చాతానికి సిద్ధ పడుతున్నారు అంటె, దీని బట్టి మనకి ఎమి అర్ధం అవుతున్నది, కెసీఅర్ ని వాళ్ళు తమ నాయకుడుగా ఆమొదించటానికి సిద్ధం గ లెరు. అలాగె తెలుగు దేశం (తెలంగాణా ) అయినా ,మరో పార్టీ ఐన.

ప్రజలు, ప్రజా నాయకులు ఇంతటి చైతన్యాన్ని, శక్తిని పెరిగే నిత్యావసర సరుకుల ధరలు దించటానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రస్నిన్చాతానికి, ఉపయోగిస్తే కిలొ కంది పప్పు ధర రు.100 నించి రు.16-20 కి, కిలొ ఉల్లిపాయల ధర రు.30 నించి రు.2 కి దిగి వచ్చేవి. ఆరోగ్యం, విద్య అంగడి సరుకు అయ్యేవి కావు.

No comments:

Post a Comment