Wednesday, December 16, 2009

స్పందన

ప్రపంచ వ్యాప్తం గా అందరి లోను ఒక భయం, అభద్రతా భావం - ఏమిటి ఇదంతా ?
జల ప్రళయం వస్తున్నదని, యుగాంతం అవుతున్నదని అనేక ఉహాలు, ఆలోచనలు, భయాలు, ఆందోళనలు...
ఒక చెప్పలేని కుతూహలం ..
ఇది ఇలా ఉంటే, మన స్వంత రాష్త్రం తీసుకుంటే, సెప్టెంబర్ ఒకట తారీకు నించి విపరీతమైన అలజడి, ప్రభుత్వ యంత్రాంగం అసలు పని చేస్తున్నదో లేదో తెలియదు, చేసినా , రోజు వారి కార్యక్రమాలు తప్ప ప్రణాళిక ల అమలు, అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష లు అసలే లేవు.

ఇంతలో పులి మీద పుట్రలాగ ప్రక్రుతి భీభాత్సాలు, వరదలు, తుఫానులు, అంటురోగాలు, ఊళ్ళకూళ్ళు కొట్టుకు పోవటం, కడుపు నింపే ఆహార ధాన్యాలు నీట మునిగి రైతన్న బతుకు వ్యధ, ఇటు తిండి గింజల కొరత-

ఈ పరిస్థితి కంటే కొందరి రాజకీయ నాయకుల కి పదవి గురించి చావో రేవో తేల్చుకోవటం ముఖ్యమే కాని, వాళ్ళని ఎన్నుకున్న ప్రజల స్థితిగతులతో సంబంధం లేదు. ఇది అవకాశం గా తీసుకుని కనీసం, ప్రజల దగ్గరకి వెళ్లి కలిగిన కష్టం మనస్ఫుర్తి గ తెలుసుకుని సహాయం చేసి వాళ్ల హృదయాలకి దగ్గర అవుదాము అనే ఆలోచన కలగక పోవటం శోచనీయం. ఇది తమకు అనుకూలం గా మార్చుకున్దామనే కనీసపు రాజకీయ ఆలోచన కూడా లేదు. భవిష్యత్తు మాట దేవుడెరుగు, కనీసం ఈ పరిస్థితి ఐన తమకు అనుకూలం గా మార్చుకుని ఉంటే ప్రజలకి వాళ్ల పట్ల కొంత సానుభూతి ఐన కలిగేది. ఆ మాత్రపు పరిణతి ఐన కనపరచ లేక పోయిన నాయకులు మనకి పాలకులు కావాలని కోరుకుంటున్నారంటే, అది వారి అలివి మాలిన స్వార్ధం కాక ప్రజా హిత మంటారా?

ఏమో ఆలోచించండి.
ఇక ఈ పరిస్థితి నించి గట్టేక్కామనుకుంటే, ఇంకో రకం (వి )నాయకులు, రాష్ట్రం ముక్కలు చెక్కలు చేసి, మా అందరికి తలా కొంచెం పంచండి అని నిరాహార దీక్షలు చేసే వాళ్ళు idantaa ప్రజా ప్రయోజనం కోసం chestunnaru అంటారా. ఏమో అది సమర్ధిస్తున్న మేధావులకి, vidyaavettalaki తెలియాలి.

ఈ మారణ హోమం నించి ఏ నిర్మాణాత్మక కార్యకలాపాలు సాధిద్దామని?
ఏమైనా నిర్మాణాత్మకంగా సాధించటానికి చాల కష్ట పడాలి కాని, నాశనం చెయ్యటానికి ఒక్క నిప్పు రవ్వ లాంటి ఆవేసపు మాట చాలు.
బయటి నించి విరుచుకు పడుతున్న ఉగ్రవాదపు భుతాలని ఎలా ఎదుర్కోవాలి, వాటి నించి ప్రజలని ఎలా కాపాడాలి అనే వ్యూహ రచన చెయ్యటానికి కాని, ఉన్నా బలగాలని ఉపయోగించి శాంతి భద్రతలని పరిరక్షించాతానికి అవకాశం కాని ఇవ్వకుండా పోలీస్ శక్తి ని antaa మన అంతర్గత సమస్యలు (అనవసరంగా మనకి మనము సృష్టించుకున్నవి ) పరిష్కరిన్చుకోవతానిని ఉపయోగించుకున్తున్నాము అంటే మన విజ్ఞత అంట ఎక్కఅడ తాకట్టు పెట్టామో ఆలోచించుకోవాలి. అసలు మనము విజ్ఞతతో ఆలోచిస్తున్నామా?

నిన్నటి వార్తల ప్రకారం తాలిబాన్ నించి ఆత్మహత్య దళం దేశం లోకి ప్రవేశించిందని విశ్వసనీయ సమాచారం. దానికి సంబంధించిన రక్షణ చర్యలు పటిష్టం గ తీసుకునేటందుకు, పోలీస్ లని వాళ్ల పనులు వాళ్ళని మనము చేసుకోనిస్తున్నామా?

అన్ని సమస్యలని రాజకీయం గానే పరిష్కరించలేము. కొన్నిటికి నిర్దుష్టమైన, సాంకేతిక పరమైన పంధాలోనే వెళ్ళాలి.
అవి అంతర్గత, ఆన్తరంగికమైన విషయాలు. వాటికి చర్చలు, ప్రజాభిప్రాయాలు ఉండవు.
దేశం మొత్తం ఈ విధంగా అట్టుడికి పోతూ ఉంటే, అవకాశం కోసం ఎదురు చూసే, బయటి శత్రువు కి పండుగే కదా. అంతర్గత కుమ్ములాటలు, బయటి శత్రువు బలపడటానికి అవకాశం ఇస్తుంది. ఇది చరిత్ర మనకి సిలాక్షరం గ తెలియ చేసిన కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేని మన చదువులు వృధా కాదా?

No comments:

Post a Comment